Indian flag hoisted on the Republic Day in the middle of Godavari by Ram Charan, Sukumar & Rangasthalam team.
దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు స్టార్లు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు సినిమా షూటింగుల్లో ఉన్నప్పటికీ సెట్లోనే వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం' షూటింగులో ఉండటంతో అక్కడే గణతంత్ర దినోత్సవ వేడుక చేసుకున్నారు.
రంగస్థలం సెట్లో జరిగిన ‘గణతంత్ర' దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్, ఇతర యూనిట్ సభ్యులు.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీసులో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసారు.
దర్శకుడు బోయపాటి శ్రీను తన టీంతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం బోయపాటి రామ్ చరణ్ 12వ చిత్రానికి పని చేస్తున్నారు.
హైదరాబాద్లోని బసవ తారకం ఆసుపత్రిలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జెండా వందనం చేస్తున్న ప్రముఖ నటుడు బాలకృష్ణ.