చింత చెట్టు నుంచి మంటలు.. పెద్ద ఎత్తున పొగలు.. అసలేం జరిగింది?

Telugu Samayam 2022-04-06

Views 116

సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ చింత చెట్టు నుంచి మంటలు రావడంతో కలకలం రేగింది. జీడిమెట్ల 31 బస్టాప్ ఉండే పాలికా బజార్‌లో చింత చెట్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పొగలు కక్కుతోంది.. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే చెట్టుకు విద్యుత్ మీటర్ బిగించి ఉండటంతో కాసేపు ఆగాల్సి వచ్చింది.. ఈలోపే చుట్టుపక్కల ఇళ్లలో భారీ ఎత్తున పొగ చూరింది. చివరికి ఎలాగోలా ఫైర్ సిబ్బంది మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే చెట్టుకు మంటలంటుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Share This Video


Download

  
Report form