మహిళ ఖాతా నుంచి రూ.51 లక్షలు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగి

Telugu Samayam 2022-04-09

Views 91

ఓ ఖాతాదారురాలి ఖాతా నుంచి బ్యాంకు ఉద్యోగే ఏకంగా రూ.51 లక్షలకు పైగా కాజేసిన ఘటన సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలో వెలుగులోకి వచ్చింది. అనసూయ(80) అనే వృద్ధురాలు ఒంటరిగా సఫీల్‌గూడాలో నివాసముంటోంది. ఆమెకు ఈస్ట్ మారేడ్‌పల్లి‌లోని ఎస్బీఐ బ్యాంక్‌లో ఖాతా ఉంది. తన ఖాతాలో కొన్నేళ్ల కింద రూ.48 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా.. మరో రూ.3 లక్షలకు పైగా నగదు ఉంది. అయితే ఈ క్రమంలోనే బ్యాంక్‌కు వచ్చి అప్పుడప్పుడు తన అవసర నిమిత్తం కొంత సొమ్ము డ్రా చేసుకుని వెళ్లేది. బ్యాంకులో తరచూ శశికుమార్ అనే ఉద్యోగి సాయంతో నగదు విత్ డ్రా చేసుకునేది. అయితే ఈ నేపథ్యంలోనే బ్యాంకు ఉద్యోగి శశికుమార్ మోసానికి పాల్పడ్డాడు. అనసూయ ఒంటరిగా ఉంటుందని గమనించి.. ఆమె అకౌంట్‌లో నుంచి విడతల వారీగా నగదును వేరొక ఖాతాకు మరలించుకున్నాడు. దీనిపై కూతురు సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form