చార్మినార్ వద్ద టెన్షన్.. టెన్షన్.. భగ్గుమన్న ముస్లింలు

Telugu Samayam 2022-06-11

Views 12

చార్మినార్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా.. పాతబస్తీలో ముస్లింలు నిరసనకు దిగారు. శుక్రవారం (జూన్ 10) మధ్యాహ్నం మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒక్కసారిగా మెరుపు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ర్యాలీగా బయల్దేరారు. నుపుర్‌ శర్మ, నిత్యానంద, రాజాసింగ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Share This Video


Download

  
Report form