దిల్లీలో భారీ వర్షాలు- భారీగా ట్రాఫిక్ జామ్

ETVBHARAT 2024-06-28

Views 284

Delhi Rains : దేశ రాజధాని దిల్లీని శుక్రవారం కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోకి వరదనీరు ఉప్పొంగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపైకి వరద నీరు రావడం వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీ వర్షాల వల్ల దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా, సఫ్దర్‌ జంగ్ వాతావరణ కేంద్రం 153.7 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదైనట్లు అంచనా వేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS