Minister Tummala on Latest News : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాక ముందే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో ఎంత మంది రుణమాఫీ కాని రైతులు ఉన్నారో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.