మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చాను - కేటీఆర్

ETVBHARAT 2024-08-24

Views 3

Women Commission Investigate KTR : మహిళలను గౌరవించాలని విచారణకు వచ్చానని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తెలిపారు. విచారణకు వస్తే మహిళా కాంగ్రెస్​ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. మహిళా కమిషన్​ కార్యాలయం వద్ద బీఆర్​ఎస్​ మహిళా నేతలపై దాడి చేశారని కేటీఆర్​ ఆరోపించారు. హైదరాబాద్​లోని బుద్ధభవన్​లో మహిళా కమిషన్​ కేటీఆర్​ను విచారించింది.

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ, మహిళా కమిషన్​ ఆదేశం మేరకు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యానని​ అన్నారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని పేర్కొన్నారు. అంతకు ముందు విచారణకు హాజరైన కేటీఆర్​కు మహిళా కమిషన్​ సభ్యులు రాఖీ కట్టారు. కేటీఆర్​ విచారణ సందర్భంగా కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మహిళా సభ్యుల మధ్య పరస్పరం తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారితీసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS