Vigilance Raids in Ricemills : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపిస్తోంది. వనపర్తి జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ బృందాలు జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లు తేలింది. అందుకు బాధ్యులైన మిల్లర్లపై అధికార యంత్రాంగం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.