Tribal Student Dies OF Food Poison in Telangana : బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విషాహారం వల్ల మృత్యువాత పడింది. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుతుందన్న కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో సహచర విద్యార్థులతో భోజనం చేసి శైలజ అనే విద్యార్థిని 21రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. కళ్లముందే కన్నకుమార్తె చనిపోవడంతో ఆ తల్లి పెట్టిన రోదన ఆకాశాన్నంటింది. విద్యార్థిని మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు.