No Response To YSRCP Yuvatha Poru Yatra in Anantapur District : అనంతపురంలో వైఎస్సార్సీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన యువత పోరు యాత్రకు స్పందన కరవైంది. నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో విద్యార్థులను తీసుకురావడానికి వైఎస్సార్సీపీ నాయకులు వెళ్లారు. అయితే విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయంటూ కళాశాల యాజమాన్యం విద్యార్థులను ర్యాలీకి పంపడానికి నిరాకరించారు. దీంతో కళాశాల యాజమాన్యంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.