ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటూ క్యాంపెయిన్

ETVBHARAT 2025-04-19

Views 46

Mulagalampalli Headmaster Campaign : ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలనే సర్కార్ లక్ష్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు. ఇక్కడ అందించే విద్యాప్రమాణాలు, సౌకర్యాలు ప్రైవేట్ స్కూల్స్​కి ఏ మాత్రం తీసిపోదని తనదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించాలని వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఆయనే ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మూడు రమేష్ బాబు.

Share This Video


Download

  
Report form