Nallari Kishore Kumar Reddy Joined TDP : Watch

Oneindia Telugu 2017-11-24

Views 1

The former Chief Minister of Andhra Pradesh, N. Kiran Kumar Reddy's brother N. Kishore Kumar Reddy and his son N. Amarnath Reddy joined the ruling Telugu Desam Party (TDP) on Thursday.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గురువారం టీడీపీలో చేరారు. కిషోర్ కుమార్‌కు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కిషోర్ కుమార్‌ తనయుడు అమర్నాథ్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున అనుచరులు తరలి వచ్చారు.గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్‌కు 44వేల ఓట్లు వచ్చాయి. కిషోర్‌ తమ పార్టీలోకి రావడంతో పీలేరు నియోజకవర్గంలో టీడీపీ బలపడుతుందని నేతలు భావిస్తున్నారు.
కాగా, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడే తన చేరికపై మార్గం సుగమం చేసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీపై మాత్రం సస్పెన్స్ కనిపించనుంది.
చిత్తూరు జిల్లాలో వైసీపీ గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొంది. అయితే కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలను టిడిపిలో చేరేలా ప్రయత్నాలు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS