Gujarat Assembly Elections : Modi In Public Meeting

Oneindia Telugu 2017-12-04

Views 465

PM Narendra Modi addresses Public Meeting in Bhavnagar in Gujarat.

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును వ్యతిరేకించే వారందరూ ఎద్దుల బండిపై ప్రయాణం చేయాలని గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్‌- ముంబైల మధ్య జపాన్‌ సహకారంతో లక్షా పదివేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బావ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినా అది సాధ్యం కాలేదని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బుల్లెట్ రైలు ప్రాజెక్టు ప్రారంభించడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS