30 Crore Investment Fraud in Nalgonda District : రూ.30 కోట్లు మోసం చేసి తనపై తానే పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే నల్గొండ చింతపల్లి మండలానికి చెందిన మనీష్ రెడ్డి నాలుగేళ్ల క్రితం మనీష్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడర్స్ పేరిట ఆఫీస్ తెరిచాడు. అందులో వందకు రెండు వందలు, వేయికి రెండు వేలు, లక్షకు రెండు లక్షలు అంటూ డబుల్ ధమాకా స్కీమ్ ప్రారంభించాడు.