Minister Lokesh Meets Union Minister Ashwini Vaishnaw : రాష్ట్రాన్ని ఏఐ హబ్గా మార్చడంపై దృష్టిసారించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. దిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏపీలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే విశాఖకు పరిశ్రమలు తరలిరానున్నాయన్న ఆయన వాట్సప్ గవర్నెన్స్లో డేటా చౌర్యం నిరూపిస్తే 10 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. నేడు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామితో లోకేశ్ భేటీకానున్నారు.