చంద్ర బాబు కు రఘువీర రెడ్డి లేఖ

Oneindia Telugu 2018-07-06

Views 1

Vijayawada: MBBS -2018 web counseling has been unfair to the candidates of reservation category ... APCC president N Raghuveera Reddy wrote aletter to CM Chandrababu on this issue.

ఎంబీబీఎస్-2018 వెబ్ కౌన్సిలింగ్‌లో రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందని...ఈ ప్రక్రియలో లోపాలను వెంటనే సరిచేయాలని కోరుతూ సిఎం చంద్రబాబుకు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి లేఖ రాశారు.
ఈ వెబ్ కౌన్సిలింగ్ లో జరిగిన భారీ అవకతవకల వలన ఎస్సీ ఎస్టీ, బీసీ, రిజర్వేషన్ విద్యార్థులు మొత్తం మీద 500 సీట్లను నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రాజ్యాంగ బద్ధంగా కల్పించబడిన రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, లేదా ఉద్దేశపూర్వక తప్పిదం వలన రాజ్యాంగ స్ఫూర్తికే తూట్లు పొడిచినట్లయిందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
జీవో 550 ని సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు 2017లో హైకోర్టులో పిటీషన్ వేయడం, దానిపై కోర్టు స్టే ఇస్తూ 2017 సెప్టెంబర్ 18లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని రఘువీరా గుర్తుచేశారు. ఇప్పటివరకూ దానిపై ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంవల్లే ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు.
అయితే ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసేయడం, ఈప్రక్రియలో గతంలో మాదిరిగా జోన్‌ని ఒక యూనిట్‌గా తీసుకోని కాకుండా కాలేజ్‌ని ఒక యూనిట్‌గా తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారని...దీనివల్ల బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు వందలాది మంది వైద్య విద్యనభ్యసించే అవకాశాన్ని కోల్పోతున్నారని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS