దామగుండం నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రక్షణ మంత్రి

ETVBHARAT 2024-10-15

Views 0

Rajnath Singh Lay Foundation Stone For The Radar Station : వికారాబాద్ జిల్లా దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు, మంత్రులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన అనంతరం వీఎల్‌ఎఫ్‌ నమూనాను పరిశీలించారు.

శత్రు దేశాలపై నిఘా ఉంచేందుకు నౌకాదశం ఈ రాడార్​ను నెలకొల్పాలని నిర్ణయించింది. దామగుండంలో అనువైన స్థలం ఉండటంతో రక్షణశాఖ అందుకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 24న రిజర్వు ఫారెస్ట్‌లోని 2,900 ఎకరాలను అటవీ అధికారులు నౌకా దళానికి అప్పగించారు. దీంతో రాడార్ స్టేషన్‌కు అవసరమైన భూములు అందుబాటులోకి రావడంతో ఇవాళ శంకుస్థాపన నిర్వహించారు. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో దామగుండం ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS